ప్రకృతి పరిరక్షణతోనే మానవ మనుగడ
టిడిపి మండల ప్రధాన కార్యదర్శి "తోట దొరబాబు"," ఆమూరు రాజబాబు"
RTVNEWS (లవకుశ)ప్రకృతి పరిరక్షణ మానవ బాధ్యతని విరివిగా మొక్కలు నాటి వాటి సంరక్షిస్తేనే భవిష్యత్తు తరాలకు మనుగుడ ఉంటుందని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి తోటా దొరబాబు, టిడిపి నాయకులు ఆమూరు రాజబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వనమహోత్సవం సందర్భంగా కోర్టు మొక్కలు నాటాలని పిలుపునివ్వడంతో గురువారం జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొయ్యూరు, బట్ట పనుకుల పంచాయతీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వం పట్టణాలు నగరాల్లో మాత్రమే ఉన్న పర్యావరణ కాలుష్యం నేడు పల్లె పల్లెకు సైతం విస్తరించిందని అన్నారు ఆధునికత వంటి అంశాలు ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా మానవాళి ప్రవర్తన ఉండరాదని పిలుపునిచ్చారు. ప్రతి మనిషికి ఆధార్ కార్డు లాగా ప్రతి ఒక్కరికి ఒక మొక్క దాని సంరక్షణ విధానం రావాలని ఈ సందర్భంగా వారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు మేడిపోయిన సత్తిబాబు బూధ రాళ్లపండు, నేమాని సత్యనారాయణ, పీసా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆమూరు రంజిత్ కుమార్, గడుతూరిసాయి రమణ, తదితరులు పాల్గొన్నారు