సామూహిక వివాహాలక నేడుు పెళ్లి రాట మహో త్సవం

Rtv Rahul
0
అంగరంగ వైభవంగా సామూహిక వివాహ పెండ్లి రాట మహోత్సవం 
 
RTVNEWS (లవకుశ)శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించనున్న సామూహిక వివాహ మహోత్సవ ముహూర్త పెండ్లిరాట కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఈనెల 30 శుక్రవారం ఉదయం శ్రీ వెంకట పద్మావతి కళ్యాణ మండప ప్రాంగణంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివాసీల సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రత్యక్ష పర్యవేక్షకులుగా శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి హాజరుకానున్న సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ముహూర్తపు పెండ్లిరాట కార్యక్రమాన్ని దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక పెద్దలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి సూర్య మాట్లాడుతూ ఈనెల 30 శుక్రవారం ఉదయం 10 గంటల శుభ ముహూర్తమున 108 ఆదివాసి వధూవరులకు వైదిక విధి విధానములో సామూహిక వివాహ మహోత్సవాల్ని జరుపనున్నట్లు తెలిపారు. దీనికి ఆదివారం ఉదయం 9 గంటల 6 నిమిషాలకు పెళ్ళిరాట మహోత్సవాన్ని అర్చకులు భద్రాద్రి రాముడు శాస్త్రోక్తంగా స్థానిక దంపతులు, గ్రామస్తుల చే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు రాట్నాల సూర్య, డివిడి ప్రసాద్, లోకుల కిరణ్, కొండబాబు గిరిబాబు పద్మరాజు రామకృష్ణ హైందవ సైన్యం వ్యవస్థాపకులు పెనుగొండ దుర్గాప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతల్లి లింగమూర్తి మల్లేష్ తదితర పలువురు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">