ఏ ఎల్ పురంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు. సర్పంచ్ "లోచల సుజాత"

Rtv Rahul
0
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు 

సర్పంచ్ "లోచల సుజాత"

RTVNEWS (లవకుశ)స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర (బీట్ ద హిట్) లో భాగంగా ప్రజలకు వేసవి తీవ్రతను తగ్గించేందుకుగాను మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ లోచల సుజాత తెలిపారు. శనివారం గొలుగొండ మండలం మేజర్ పంచాయతీ ఏ ఎల్ పురం రామకోవెల ప్రాంగణంలో ఇంచార్జ్ ఈ ఓ ఆర్ డి కే శ్రీనివాసరావు తో కలసి సర్పంచ్ సుజాత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడకూడదని సదుద్దేశంతో  ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామంలోనే ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ మజ్జిగ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్, పంచాయతీ గుమస్తా హేమంత్, అంగన్వాడీ సిబ్బంది పారిశుధ్య కార్మికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">