ఈనెల 25న కేడీపేట హైస్కూల్లో గాంధీ విగ్రహం ఆవిష్కరణ
శ్రీ వాసవి క్లబ్ అధ్యక్షుడు చెక్క సంతోష్
RTVNEWS (లవకుశ)ఈనెల 25న గొలుగొండ మండలం కృష్ణ దేవి పేట ప్రభుత్వ జడ్పీ హైస్కూల్లో మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ చేయనున్నట్లు శ్రీ వాసవి క్లబ్ అధ్యక్షుడు చెక్కా సంతోష్ తెలిపారు. సోమవారం స్థానిక విలేకరులతో చెక్కా సంతోష్ మాట్లాడుతూ శ్రీ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టే వివిధ సేవా కార్యక్రమాలు చేయడంలో భాగంగా కృష్ణ దేవి పేట జడ్పీ హైస్కూల్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ వాసవి క్లబ్ ప్రతినిధులు అందరు పాల్గొంటారని తెలిపారు