21న కొండగోకిరి లో" జగన్మోహన్ రెడ్డి" పుట్టినరోజు వేడుకలు
మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు "జల్లిబాబులు
RTVNEWS (లవకుశ)వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఈనెల 21న కొండ కోకిరిలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జల్లిబాబులు మాట్లాడుతూ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు .ఈ వేడుకలకు ఎంపీపీ బడుగు రమేష్, జడ్పిటిసి వార నూకరాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేగటి ముసిలినాయుడు, వైయస్సార్సీపి సర్పంచులు, ఎంపీటీసీలు, గతంలో వివిధ నామినేటెడ్ పదవులు చేపట్టిన నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని జల్లిబాబులు ఈ సందర్భంగా కోరారు